info@raviproduction.com

హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కనాలి: RSS

RSS చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీలో జరిగిన వంద వర్ష్ కీ సంఘ్ యాత్ర కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో జనాభా నియంత్రణపై ఎలాంటి చట్టాలు లేవని, హిందూ సమాజం వృద్ధి చెందడానికి ఇది అవసరమని ఆయన తెలిపారు. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని, భాషాపరమైన తేడాలు ఉండకూడదని, అలాగే సంస్కృత భాష నేర్చుకోవడం మంచిదని సూచించారు. గతంలో తాను 75 ఏళ్లకే పదవీ […]

ఫ్యామిలీ స్కోర్.. ఫ్యామిలీ కార్డ్.

ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు కొత్తగా ఫ్యామిలీ కార్డులు ప్రవేశపెడుతోంది. ఇవి ఆధార్ కార్డులా ఉంటాయి. ప్రతి కుటుంబానికి ప్రత్యేక నెంబర్ కేటాయించి, ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాల వివరాలు అందులో ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా, ఈ కార్డులో ఒక ఫ్యామిలీ స్కోర్ కూడా ఉంటుంది. ఇది బ్యాంకుల్లో ఉండే సిబిల్ స్కోర్‌లా అన్నమాట. కుటుంబానికి ప్రభుత్వం ఎంత మేలు చేసిందో చూపిస్తుంది. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఫ్యామిలీ కార్డు ఇస్తారు. […]

ఛాన్స్ మిస్ చేసుకున్న వైసిపి

రాజకీయాల్లో సమయానికి తగిన విధంగా స్పందించడం చాలా ముఖ్యం. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడమే నేతల విజయ రహస్యం. గతంలో చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా జగన్‌పై వ్యతిరేకత చూపుతూ జనంలోకి వెళ్ళారు, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ వ్యతిరేకతను కూడా ఎన్నికల సమయంలో ఉపయోగించుకున్నారు. కానీ, ఇటీవల దివ్యాంగుల పింఛన్ల విషయంలో వైసీపీ మాత్రం పెద్దగా స్పందించలేదు. రెండు దశాబ్దాలుగా పింఛన్లు తీసుకుంటున్న కొందరిని అనర్హులుగా ప్రకటించడంతో దివ్యాంగులు రాష్ట్రవ్యాప్తంగా […]

వైయస్ జగన్, కెసిఆర్ ప్లానింగ్

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ముఖ్య నేతలైన కేసీఆర్‌, జగన్‌ రాజకీయ తీరులో చాలా పోలికలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలైన ఈ ఇద్దరూ అసెంబ్లీకి దూరంగా ఉంటూ ఇప్పటివరకు సభా కార్యక్రమాలకు హాజరు కాలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. సెప్టెంబర్ మూడో వారం నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు జగన్ హాజరవుతారని సమాచారం. టీడీపీ కూటమి ప్రభుత్వంపై సభలోనే బహిరంగంగా విమర్శలు చేస్తారని అంటున్నారు. మరోవైపు తెలంగాణాలో కూడా […]

షర్మిలపై కాంగ్రెస్ నేతల ఫైర్

రాష్ట్ర కాంగ్రెస్‌లో మళ్లీ షర్మిల పేరు హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల పార్టీ డీసీసీల నియామకాలు చేస్తామని అధిష్ఠానం ప్రకటించగా, చాలా మంది నాయకులు పదవుల కోసం ఆసక్తి చూపించారు. కానీ షర్మిల పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసి ఇప్పుడే డీసీసీల అవసరం లేదని చెప్పినట్టు సమాచారం. ఆమె అభిప్రాయం ప్రకారం ఇప్పుడు పదవులు ఇస్తే అధికార కేంద్రాలు ఏర్పడి, పార్టీకి సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. అంతేకాక కొందరు నాయకులు క్రమశిక్షణ పాటించడం లేదని, సొంత అజెండాలతో […]

ట్రంప్ 50% టారిఫ్ మొదలయ్యింది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై 50% టారిఫ్‌లు విధించడం వల్ల మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాల్‌గా మారింది. అమెరికా మన రెండో అతిపెద్ద ఎగుమతి కేంద్రం కావడంతో, స్టీల్, టెక్స్‌టైల్స్, ఆటో పార్ట్స్, కెమికల్స్ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. స్టీల్ ఎగుమతులు 30-40% వరకు తగ్గవచ్చు, టెక్స్‌టైల్స్ రంగంలో బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలు లాభపడవచ్చు. MSME రంగంలో లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని experts చెబుతున్నారు. అయితే ఫార్మా […]

గణేష్ విగ్రహం మీద కోడిగుడ్ల దాడి

వడోదరలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దారుణ ఘటన చోటు చేసుకుంది. ఊరేగింపుపై కొందరు యువకులు గణపతి విగ్రహంపై గుడ్లు విసిరారు. ఇది మత సామరస్యాన్ని దెబ్బతీసే ఉద్దేశమేనని పోలీసులు చెప్పారు. వడోదర పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని నలుగురు యువకులను అరెస్టు చేశారు. వారిలో ఒకరు మైనర్ అని తెలిపారు. సాధారణంగా జైలు శిక్ష విధిస్తారు, కానీ ఈసారి ప్రజలకు స్పష్టమైన సందేశం ఇవ్వడానికి వినూత్న పద్ధతిలో శిక్షించారు. నిందితులను సంఘటన జరిగిన ప్రదేశానికి తీసుకువచ్చి, […]

మోడీ ఎడ్యుకేషన్.. బిగ్ డిబెట్

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతల వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. మోడీ ఇప్పటికే మూడు సార్లు ప్రధాని అయ్యి, పదకొండేళ్లుగా దేశాన్ని నడిపిస్తున్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. కానీ ఆయన డిగ్రీ గురించి ప్రతిపక్ష నేతలు ఎప్పట్నుంచో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తాజాగా ఢిల్లీ హైకోర్టు తీర్పులో, మోడీ తన విద్యార్హతలను బయట పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టమైంది. ఇదే విషయాన్ని కేంద్ర సమాచార కమిషన్ 2016లో ఢిల్లీ […]

చెవిరెడ్డి కోర్టులో ఏడ్చేశారు

ఏపీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుల్లో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒకరు. మంగళవారం కోర్టులో తీవ్ర స్థాయిలో ఎమోషనల్ అయ్యారు. చెవిరెడ్డి జైలు జీవితాన్ని తట్టుకోలేక, వెన్నునొప్పితో తీవ్ర బాధ పడుతున్నారని, తక్షణ వైద్య సహాయం అందించాలని ఏడ్చారు. గతంలో ప్రభుత్వానికి, పోలీసులకు వార్నింగ్స్ ఇస్తూ ధైర్యవంతుడిగా గుర్తింపు పొందిన ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు, కోర్టులో కూడా భయంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మద్యం స్కాంలో దాదాపు 250 కోట్ల నగదును ఎన్నికల్లో […]

పూసల పిల్ల మోనాలిసా సౌత్ ఎంట్రీ

ప్రయాగ్ రాజ్ కుంభమేళా సమయంలో ఓ గ్రామంలోని యువతి మోనాలిసా ఆకస్మికంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారిగా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. బాలీవుడ్ లో అవకాశాలు కూడా వచ్చాయి. అయితే, తొలి సినిమా ఆఫర్ ఒక వివాద కారణంగా నిలిచిపోయింది. ఆ తరువాత, ఒక మ్యూజిక్ వీడియోలో నటించి మళ్ళీ మెరిసింది. ఇప్పుడు మోనాలిసా దక్షిణాది సినిమా పరిశ్రమలో అడుగుపెడుతోంది. మలయాళంలో ‘నాగమ్మ’ సినిమాలో సీనియర్ నటుడు కైలాష్‌తో కలిసి నటించబోతుంది. ఈ […]