info@raviproduction.com

వంగవీటికి రాజ్యసభ? సూపర్ ప్లాన్

ఈ ఏడాది ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లపై ఏపీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. కూటమి పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనగా, ముఖ్యంగా టీడీపీలో అంతర్గత చర్చలు ఉత్కంఠ రేపుతున్నాయి. రోజుకో కొత్త పేరు రేసులోకి వస్తుండగా, సామాజిక వర్గాల సమీకరణాలు, ప్రాంతీయ లెక్కలు, గత హామీలు అన్నీ కలిసి సస్పెన్స్ గా ఉన్నాయి.ఇప్పటికే టీడీపీ నుంచి టీడీ జనార్ధన్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్ బాబు పేర్లు వినిపిస్తుండగా, అనూహ్యంగా వంగవీటి రాధా […]

రేవంత్ రెడ్డి కత్తికి ఎదురులేదా?

తెలంగాణ రాజకీయాల్లో తనదైన వ్యూహాలతో వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టీడీపీ నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకుని, 2016లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన, పీసీసీ చీఫ్‌గా పార్టీకి నూతన శక్తిని నింపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి సీఎం పదవిని అందుకున్నారు.మాటల మాంత్రికుడిగా గుర్తింపు పొందిన రేవంత్, తన తెలంగాణ యాసలో చేసే పదునైన విమర్శలు, పంచ్ డైలాగ్‌లతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. సీఎం అయిన తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో […]

అసెంబ్లీకి దూరంగా జగన్, వైసీపీ యాక్టివ్ ప్లాన్ రెడీ

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విషయంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ నిర్ణయాలు మారుతూ ఉండటం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. మొదట సభకు వస్తానన్న జగన్, తర్వాత ప్రతిరోజూ హాజరవుతానని పార్టీ వర్గాలు చెప్పినా… తొలి రోజు కొద్ది నిముషాలపాటు ఉండి వెళ్లిపోయారు. ఆపై పూర్తిగా గైర్హాజరు అయ్యారు.ఇక ఎమ్మెల్సీలకు మాత్రం పూర్తి స్థాయిలో మండలిని వినియోగించుకోవాలని సూచించారు. నాకన్నా మీకే ఎక్కువ తెలుసంటూ వారిని ప్రోత్సహిస్తూ, అన్ని అంశాలపై ఆధారాలతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. అసెంబ్లీలో […]

ప‌వ‌న్ క‌ల్యాణ్ సర్, ఇటు ఓ లుక్కేయండి

ఆంధ్రప్రదేశ్‌లో మహాశివరాత్రి వేడుకల ముందు శ్రీశైలం అడవి మార్గం వివాదం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అటవీ శాఖ–దేవదాయ శాఖల మధ్య తలెత్తిన ఆర్థిక వివాదంపై ఆయన జోక్యం అవసరమని అధికారులు కోరుతున్నారు.శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది వేలాది భక్తులు నల్లమల అడవిలోని 46 కిలోమీటర్ల నడక మార్గం ద్వారా శ్రీశైలానికి చేరుకుంటారు. ఈ […]

మండలిలో నారా లోకేష్ కొత్త ట్రెండ్,

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండో రోజు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో సభలో అధికార కూటమి సభ్యులే కనిపించారు. ప్రశ్నలు కూడా వారివే… సమాధానాలు కూడా వారివే అన్నట్టుగా వాతావరణం సాగింది. అయితే శాసన మండలిలో మాత్రం భిన్నంగా కనిపించింది. వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున స్పందిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో మంత్రులు కూడా మండలిపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ వ్యవహరించిన తీరు ఇప్పుడు […]

అసెంబ్లీలో బాలయ్యపై జోక్, సభలో నవ్వులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేగా హాజరైన హీరో బాలకృష్ణ పేరు ప్రస్తావన రావడంతో సభలో నవ్వులు పూశాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరుగుతుండగా, సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు బీజేపీ LP నేత విష్ణు కుమార్ రాజు ను మాట్లాడమని ఆహ్వానించారు.తనకు ఎంత సమయం ఇస్తున్నారో అడిగిన విష్ణుకుమార్ రాజుకు, పది నిమిషాలు మాత్రమే అనడంతో ఆయన చలోక్తి విసిరారు. నా పక్కన […]

తిరుమల లడ్డూ గొడవలో బావ vs బావమరిది

ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ Y. V. సుబ్బారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. లడ్డూ ప్రసాదం అంశాన్ని పదే పదే ప్రస్తావించడం భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తుందని చెప్పిన బాలినేని, అదే సమయంలో లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని వైవీ స్వయంగా ఒప్పుకున్నారని ఆరోపించారు. ఆ సమయంలో ఛైర్మన్‌గా ఉన్న వైవీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.అయితే ఈ […]

జ‌గ‌న్ నేరస్థుడు కాక ఏంటి?: చంద్ర‌బాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు తీవ్ర కామెంట్స్ చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఇటీవలి పరామర్శ యాత్రలను లక్ష్యంగా చేసుకుని ఆయన సెటైర్లు పేల్చారు. తాడేపల్లి నుంచి గుంటూరు, ఇబ్రహీంపట్నం వంటి సమీప ప్రాంతాలకు వెళ్లేందుకు అరగంట సరిపోతుందని, కానీ గంటల తరబడి జాతరలా ర్యాలీలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని విమర్శించారు. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. జాతీయ రహదారులు ఎవరి సొంతం కాదని, ప్రజల సొమ్ముతో నిర్మించబడినవని గుర్తు […]

జనసేన పరువు తీసిన బిజెపి

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణలో బీజేపీకి ఎవరి మద్దతు అవసరం లేదు… ఇక్కడ మేము ఒంటరిగానే బలంగా ఉన్నాం అని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ తెలంగాణలో అలాంటి కూటమి లేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారా అనే ప్రశ్నకు ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తాడా?అంటూ చేసిన వ్యాఖ్యలు జనసేన శ్రేణుల్లో అసంతృప్తిని రేకెత్తించాయి.ఎన్నికల ముందు ఆహ్వానం ఇచ్చి […]

ఏపీ అసెంబ్లీలో ఏఐ ఫేషియల్ అటెండెన్స్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సరికొత్త సాంకేతికతతో మరో ముందడుగు వేసింది. ఎమ్మెల్యేల హాజరు నమోదు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత Facial recognition విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై సభ్యులు తమకు కేటాయించిన సీటులో కూర్చుంటేనే హాజరు ఆటోమేటిక్‌గా నమోదు కానుంది. సభలో ఎంతసేపు ఉన్నారు? మధ్యలో వెళ్లిపోయారా? అన్నది కూడా సిస్టమ్ స్పష్టంగా నమోదు చేస్తుంది.175 మంది ఎమ్మెల్యేల ఫొటోలను Vectorization చేసి సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేశారు. సభలో ఏర్పాటు చేసిన పీటీజెడ్ కెమెరాల ద్వారా […]