info@raviproduction.com

బడ్జెట్ సెషన్‌పై చంద్రబాబు సీరియస్

ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సెషన్ ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులకు కీలక దిశానిర్దేశం చేశారు. 17 పని దినాల పాటు సాగే ఈ సెషన్‌లో ప్రతీ ఒక్కరూ క్రమం తప్పకుండా హాజరుకావాలని స్పష్టం చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే సభా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, సబ్జెక్ట్‌పై పూర్తిగా ప్రిపేర్ అయి మాట్లాడాలని సూచించారు. సభలో చేసే ప్రతి ప్రసంగం రికార్డు అవుతుందని, ప్రజలు జాగ్రత్తగా గమనిస్తారని […]

జగన్‌ను కలిసిన దువ్వాడ, రీ-ఎంట్రీకా?

శ్రీకాకుళానికి చెందిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అసెంబ్లీ ఆవరణలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కొద్దిసేపు మాట్లాడేందుకు ప్రయత్నించిన దువ్వాడకు, “తర్వాత మాట్లాడుకుందాం” అన్న సంకేతం జగన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో దువ్వాడ తిరిగి వైసీపీలో చేరే ప్రయత్నంలో ఉన్నారనే ప్రచారం జోరందుకుంది.దువ్వాడకు వ్యక్తిగతంగా జగన్‌పై అభ్యంతరం లేదని, ధర్మాన బ్రదర్స్‌పైనే అసంతృప్తి ఉందని ఆయన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలంటే జిల్లా నాయకులతో […]

జగన్‌ రాజీనామా చేయాలి: షర్మిల ఫైర్

ఏపీ రాజకీయాల్లో మరోసారి అన్నా–చెల్లెళ్ల మాటల యుద్ధం వేడెక్కింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైసీపీ అధినేత జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి హాజరైన జగన్ కొద్దిసేపటికే సభను వీడటం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నాయకుడిగా జగన్ పూర్తిగా విఫలమయ్యారని, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా మైక్ కోసం మారాం చేయడం సరైంది కాదని ఎద్దేవా చేశారు.రాయలసీమకు ద్రోహం చేసిన వారిలో జగన్, బాబు ఇద్దరూ […]

సుపథం టికెట్ల వివాదం – ఇదేంటి సుబ్బారెడ్డి?

వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డిని ఇబ్బందుల్లోకి నెట్టేలా సుపథం టికెట్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితుడైన చిన్నప్పన్నకు తనతో ఎలాంటి సంబంధం లేదని సుబ్బారెడ్డి చెబుతున్న నేపథ్యంలో, ఒక నెలలో చిన్నప్పన్న పేరిట 6433 సుపథం టికెట్లు జారీ అయిన విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.జగన్ ప్రభుత్వ కాలంలో ఒక్కో ఎమ్మెల్యేకు రోజుకు ఆరు సుపథం టికెట్లు మాత్రమే జారీ చేసే నిబంధన ఉండగా, 2021 సెప్టెంబరులో […]

తెలుగు రాష్ట్రాల్లో ఫేక్ కరెన్సీ కలకలం

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి నకిలీ నోట్లు సంచలనం రేపుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున దొంగ నోట్లు చలామణి అవుతున్న ఘటన వెలుగుచూసింది. జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో నకిలీ కరెన్సీతో లావాదేవీలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు.అప్పు తీసుకున్న ఓ వ్యక్తి దొంగ నోట్లు ఇచ్చాడని ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పెద్దకొడప్‌గల్, అంతాపూర్, జుక్కల్ వజ్రకండి గ్రామాలకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నకిలీ […]

ఏంటి ఈ జెనరేషనల్ స్మోకింగ్ బ్యాన్?

మాల్దీవులు ప్రపంచంలోనే మొట్టమొదటిగా జెనరేషనల్ స్మోకింగ్ బ్యాన్ అమలు చేసిన దేశంగా నిలిచింది. నవంబర్ 1 నుంచి ఈ చట్టం అధికారికంగా ప్రారంభమైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రజారోగ్యాన్ని కాపాడడం, పొగాకు రహిత కొత్త తరాన్ని తయారు చేయడం ఈ నిర్ణయానికి ప్రధాన లక్ష్యం.ఈ నిబంధన ప్రకారం 2007 జనవరి 1 తర్వాత జన్మించిన ఎవరైనా వ్యక్తి మాల్దీవుల భూభాగంలో పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులు కొనడం, విక్రయించడం నిషేధం. ఉల్లంఘన చేస్తే 50,000 రుఫియా […]

కూటమితో వైసీపీకి కఠిన పరీక్ష,

ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీల రాజకీయ వ్యవస్థ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఒకసారి టీడీపీ, మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తున్నా – ఈసారి మాత్రం పరిస్థితి వేరుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.2024లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈసారి చంద్రబాబు అనుభవం, కూటమి సమన్వయం, అభివృద్ధి–సంక్షేమం మధ్య సమతుల్యత ప్రజల మద్దతు కూటమికి బలాన్నిచ్చాయి. అటు పార్టీ వ్యవస్థను బలంగా ఉంచి, ఇటు పాలనలో వేగం చూపిస్తున్నారు.వైసీపీ మాత్రం ఓటమి తర్వాత దిశా నిర్దేశం లేక […]

మాటలేనా, పనులెక్కడ?: ప్రియాంక

బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ బీజేపీపై సంచలన కామెంట్స్ చేశారు. ఎప్పుడూ నెహ్రూ, ఇందిరాగాంధీలను తప్పుపట్టడం తప్ప బీజేపీ నేతలు దేశానికి చేసిన పని ఏంటని ఆమె నిలదీశారు. నెహ్రూ, ఇందిర దేశానికి పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకువచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేశారు. కానీ బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసిందని ఆమె ప్రశ్నించారు.ప్రియాంకా మాట్లాడుతూ – బీజేపీ నేతలు ఎప్పుడూ గతాన్ని తవ్వుతారు […]

ఊపిరి పోతోంది, వదిలితే బెటర్

దేశ రాజధాని ఢిల్లీ మరోసారి ఎయిర్ పొల్యూషన్ తో వణికిపోతోంది. శీతాకాలం మొదలవగానే వాతావరణంలో పొగమంచు, ధూళి, వాయు కాలుష్యం మోత ముమ్మరంగా పెరిగింది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యతా సూచీ 400 దాటింది. ఇది తీవ్ర ప్రమాద స్థాయిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎయిమ్స్ మాజీ పల్మోనాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ ఖిల్నాని మాట్లాడుతూ – “వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల, గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. వీలున్న వారు రెండు నెలల పాటు ఢిల్లీని వదిలి […]

V రీల్స్‌ – సోషల్ మీడియా విప్లవం

నేటి డిజిటల్‌ ప్రపంచంలో వీరీల్స్‌ (Vreels) వేగంగా పేరు తెచ్చుకుంటోంది. అమెరికా, భారతదేశం కలిసి రూపొందించిన ఈ ప్లాట్‌ఫాం ప్రస్తుతం 22 దేశాల్లో అందుబాటులో ఉంది. టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను మించి భిన్నంగా ఉంది. ఇది చిన్న వీడియోలు, చాటింగ్‌, కాల్స్‌, ఫోటో షేరింగ్‌, ఇ-కామర్స్‌ వంటి అన్ని ఫీచర్లను ఒకే యాప్‌లో అందిస్తోంది.వీరీల్స్‌ అంటే Virtually Relax, Explore, Engage, Live & Share అని అర్థం. ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు ఫిల్టర్లు, స్టిక్కర్లు, మ్యూజిక్‌ […]