info@raviproduction.com

జైషే కొత్త కుట్రలో మహిళా బ్రిగేడ్

పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఇప్పుడు కొత్త ప్లాన్ వేసింది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, జైషే ఇప్పుడు మహిళా ఉగ్రవాద గ్రూప్ ను ఏర్పాటు చేస్తోంది.జమాతే ఉల్ మామినాత్ పేరుతో ఈ బ్రిగేడ్‌ను జైషే ఏర్పాటు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ యూనిట్‌కు జైషే నేత మసూద్ అజహర్ సోదరి సాదియా అజార్ నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. బహవల్పూర్‌లోని […]

ఉప్పాడలో పవన్ కళ్యాణ్ ఆవేశం.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడలో చేసిన ప్రసంగం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన మాటల్లో ఆవేశమా? భావోద్వేగమా? లేక తన నిబద్ధతపై ప్రజలకు హామీనా? అన్నదానిపై చర్చ మొదలైంది.ఉప్పాడలో మత్స్యకారులతో మాట్లాడిన పవన్, మీ సమస్యలు పరిష్కరించలేని రోజు నేను రాజకీయాలు వదిలేస్తాను. అంటూ సంచలన కామెంట్ చేశారు. మత్స్యకారుల కష్టాలు తనవే అని, వారి కోసం తాను ఉన్నానని స్పష్టం చేశారు. మీరు తిడితే పడతాను, దెబ్బ పడితే భుజం […]

లోకేష్ మరో డీఎస్సీ డేట్ అనౌన్స్

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ముగిసిన మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం, ఇకపై ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహణ కొనసాగించాలని నిర్ణయించింది.గురువారం విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. వచ్చే నెలలో టెట్ నిర్వహించాలి, జనవరిలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, మార్చిలో పరీక్షలుపూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త టీచర్లు వచ్చే విద్యా సంవత్సరం […]

ఆసియా కప్ ట్రోఫీని వద్దన్న ఇండియా.

దుబాయ్‌లోని ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్‌, పాకిస్తాన్ టీమ్స్ తలపడ్డాయి. ఇండియా అద్భుత విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం, భారత జట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్‌ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన్‌ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి ఇష్టంలేని భారత్‌ ఆటగాళ్లు ట్రోఫీని నిరాకరించారు.ట్రోఫీ, మెడల్స్ లేకుండా టీమ్‌ఇండియా ప్లేయర్స్ గ్రౌండ్‌లో దూరంగా నిలబడ్డారు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, కెరీర్‌లో విజేత జట్టు ట్రోఫీని తిరస్కరించడం […]

మూసీపై రేవంత్ రెడ్డి చెప్పిందే నిజం.

హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ సమస్యల పరిష్కారం కోసం ముందుకు వచ్చింది. నగరంలోని కాలువలు, చెరువులు ఆక్రమణలకు గురవడం వలన చిన్న వర్షం కూడా భారీ నష్టానికి కారణమవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచి హైడ్రా పద్ధతిని ప్రవేశపెట్టి, నగరంలో దురాక్రమణ పరిస్థితులను నియంత్రించారు. ప్రారంభంలో ప్రజలకు కాస్త ఇబ్బందులు ఎదురైనా దీని ఫలితాలు దీర్ఘకాలంలో కనిపిస్తాయని అధికారులు చెప్పారు.ఇక రేవంత్ రెడ్డి ప్లాన్ వమచేసిన మరో ప్రాజెక్ట్ మూసీ నది ప్రక్షాళన. […]

ట్రంప్‌కు పాక్ రేర్ ఎర్త్ బహుమతి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వేసిన వ్యూహం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో కలిసి ఆయన వైట్ హౌస్ సందర్శించారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు విలువైన రేర్ ఎర్త్ మినరల్స్‌తో నిండిన చెక్క పెట్టెను బహుమతిగా ఇచ్చారు. శ్వేతసౌధం విడుదల చేసిన ఫొటోలలో మునీర్ ఆ రంగురాళ్ల వివరాలు చెబుతుండగా, ట్రంప్ ఆసక్తిగా పరిశీలించినట్లు కనిపించారు.రేర్ ఎర్త్ మినరల్స్‌పై అమెరికాకు ఉన్న ఆసక్తి తెలిసిందే. చైనాకు […]

దళపతి విజయ్ ట్వీట్ వైరల్

తమిళనాడులోని కరూర్ జిల్లాలో దళపతి విజయ్ నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో జరిగిన భారీ తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.అధికారుల సమాచారం ప్రకారం, ర్యాలీకి కేవలం 10 వేల మందికి అనుమతి ఉన్నా, సుమారు 2 లక్షల మంది హాజరవ్వడంతో నియంత్రణ కోల్పోయి ఈ విషాదం చోటుచేసుకుంది.ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదం వ్యక్తమవుతోంది. హీరో విజయ్ మొదట మీడియా ప్రశ్నలకు స్పందించకపోయినా, అనంతరం సోషల్ […]

రైతుల సమస్యలపై పొలం బాట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పొలం బాట కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రైతుల సమస్యలను తెలుసుకోవడం, వారి ఆవేదనను తొలగించడం లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమం తలపెట్టారు. పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం, యూరియా కొరత, అన్నదాత సుఖీభవ నిధుల ఆలస్యం వంటి సమస్యల కారణంగా రైతుల్లో ఆగ్రహం పెరిగింది.చంద్రబాబు అసెంబ్లీలో చెప్పినట్లు, ప్రతి నెల నాలుగు రోజులపాటు రైతులతో భేటీ అయ్యి వారి సమస్యలను తెలుసుకోవాలని సీఎం ఎమ్మెల్యేలకు సూచించారు. గతంలో పల్లె నిద్ర కార్యక్రమం […]

షర్మిల దూకుడు – వైసీపీకి సవాల్

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కొత్త సీన్‌ కనిపిస్తోంది. మూడు పార్టీల కూటమి ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఉన్నా.. అసెంబ్లీలో సంఖ్యా బలం లేకపోవడంతో సీరియస్‌గా ఒత్తిడి తీసుకురాలేక పోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మాత్రం దూకుడు పెంచుతున్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోయినా, షర్మిల నాయకత్వంలో క్రమంగా పార్టీకి గుర్తింపు వస్తోందని చెబుతున్నారు. ఇటీవల రైతు సమస్యలపై చలో అసెంబ్లీ అంటూ పిలుపునిచ్చి, స్వయంగా ఉద్యమానికి దిగడం షర్మిలకు […]

చంద్రబాబు, పవన్ భేటీ, బాలయ్యే రీజన్?

హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న పవన్‌ను ఆదివారం ఆయన నివాసంలో చంద్రబాబు పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అసెంబ్లీ సమావేశాల సమయంలో జ్వరంతో ఉన్న పవన్, తగ్గకపోవడంతో హైదరాబాద్‌కి వచ్చారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నేరుగా ఆయన ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు కొంతసేపు చర్చించుకోవడం, బయటకు వచ్చి పవన్ […]