info@raviproduction.com

ఇలా అయితే TDP ని మూసేయాల్సిందే?

తెలంగాణలో టీడీపీ గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో కనిపించడంలేదు. 2018 అసెంబ్లీ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయడం లేదు. 2023లో కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో టీడీపీ పాల్గొనకపోవడం పార్టీకి పెద్ద షాక్‌గా మారింది.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ వదిలి వెళ్లడంతో, చాలామంది నేతలు కూడా పక్క మార్గాలను చూస్తున్నారు. ఇంతకుముందు ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉన్న నేతలు ఇప్పుడు కనిపించట్లేదు. ఇటీవల తెలంగాణ టీడీపీ డెలిగేషన్ ఏపీకి వెళ్లి […]

మమత కామెంట్స్ పై ఫైర్

దుర్గాపూర్‌లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 23 ఏళ్ల ఒడిశా విద్యార్థిని శుక్రవారం రాత్రి సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఆమె స్నేహితుడితో బయటికి వెళ్లగా, ముగ్గురు వ్యక్తులు ఆమెను బెదిరించి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యాచారం చేశారు. వారి నుండి ఆమె మొబైల్, పర్సులోని 5 వేలను కూడా తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ ఘటనపై స్పందిస్తూ, అర్ధరాత్రి విద్యార్థులు బయటకు వెళ్తే బాధ్యత ఎవరిది? […]

ముంబై నుంచి విశాఖకు సముద్ర గర్భ కేబుల్

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ మాతృసంస్థ మెటా, భారత్‌లో తమ సముద్రగర్భ కేబుల్‌ ప్రాజెక్ట్‌ కోసం సైఫీ టెక్నాలజీస్ ను ల్యాండింగ్ భాగస్వామిగా ఎంపిక చేసింది. ఈ ఒప్పందం విలువ సుమారు 5 మిలియన్ డాలర్లు. ఈ కేబుల్‌ను ముంబయి, విశాఖపట్నం తీరాల్లో డాకింగ్ చేయనున్నారు.ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రగర్భ కమ్యూనికేషన్ ప్రాజెక్ట్‌. ఈ ప్రాజెక్ట్ వాటర్‌వ‌ర్త్ 50,000 కిలోమీటర్ల పొడవుతో, భూమి చుట్టుకొలత కంటే ఎక్కువగా ఉండే ఈ కేబుల్‌ ఐదు ఖండాలను కలుపుతుంది. దీన్ని సముద్రంలో […]

భారత్‌ VS వెస్టిండీస్‌: యశస్వి శతకం

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ ఆరంభంలోనే ఆధిపత్యం చూపింది. యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ 173 రన్స్ తో దూసుకెళ్తూ జట్టుకు బలాన్ని ఇచ్చాడు. అతడికి జతగా సాయి సుదర్శన్‌ 87 రన్స్ తో ఫామ్‌లోకి వచ్చాడు. తొలి రోజు 90 ఓవర్లలో భారత్‌ 318/2 తో బలంగా ఉంది. క్రీజులో జైస్వాల్‌కి.. గిల్‌ 20 రన్స్ తో జతగా ఉన్నాడు.ప్రధానమైన విండీస్‌ బౌలర్‌ జోమెల్‌ వారికన్‌ రెండు వికెట్లు తీసాడు. మ్యాచ్‌లో ఆసక్తికరంగా, తొలి […]

ఓల్డ్ మొబైల్స్‌ అమ్మేస్తున్నారా? బికేర్ ఫుల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దనల్లబెల్లి గ్రామంలో పోలీసులు పాత మొబైల్స్ చోరీని ఆపారు. నలుగురు వ్యక్తులు నాలుగు బైక్‌లపై పాత ఫోన్లను సేకరించడానికి ఊరూరా తిరుగుతూ, ఇంట్లోని పాడైన ఫోన్లకు ప్లాస్టిక్‌ సామాన్లు ఇస్తామని మోసానికి పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.పోలీసుల కనుగొన్న వ్యక్తిలో బీహార్‌ రాష్ట్రం నుంచి అక్తర్‌ ఆలీఖాన్‌ అనే వ్యక్తి దొరికాడు. అతను సేకరించిన 150 పాత మొబైల్స్, ప్లాస్టిక్ సామాన్లు, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అధికారుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం, ఈ పాత […]

ఇంటికో ఉద్యోగం: ఆర్జేడీ ఆఫర్

ఎన్నికల సీజన్ మొదలైతే హామీల వర్షం కురవడం సహజం. ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీలు రంగురంగుల కలలతో ప్రచారాన్ని మోతెక్కిస్తాయి. కానీ వాటిలో చాలావరకు అమలు కాకుండానే మరిచిపోతారు. ఇప్పుడు బీహార్‌లో మాత్రం ఒక హామీ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.. అదే ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం.. అని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఇచ్చిన మాట. బీహార్‌లో నిరుద్యోగం అత్యధికంగా ఉండటంతో ఈ హామీ యువతలో భారీ చర్చకు దారి తీసింది. అయితే రెండు […]

హైదరాబాద్‌లో హైడ్రా సూపర్ హిట్

హైదరాబాద్‌ నగరంలో ప్రభుత్వ భూముల రక్షణలో భాగంగా HYDRAA (Hyderabad Disaster Response and Asset Protection Agency) మరో పెద్ద ఆపరేషన్ చేపట్టింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.10, షేక్‌పేట్‌ మండలంలో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిపై జరిగిన ఆక్రమణలను తొలగించి 750 కోట్ల విలువైన భూమిని తిరిగి ప్రభుత్వాధీనంలోకి తీసుకుంది.నకిలీ పత్రాలతో ఆక్రమణ చేసినపార్థసారథి అనే వ్యక్తి తప్పుడు సర్వే నంబర్‌ 403/52 ఆధారంగా ఈ భూమిని తనదిగా చూపించుకున్నాడు. భూమి చుట్టూ కంచె […]

కరూర్‌ తొక్కిసలాటపై సుప్రీం షాక్

తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ నిర్వహించిన ర్యాలీలో జరిగిన భయానక తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని ఆదేశించగా, టీవీకే పార్టీ ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.తాజాగా సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌పై విచారణ జరిపింది. తమిళనాడు పోలీసులతోనే సిట్ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాన్ని సర్వోన్నత న్యాయస్థానం వ్యతిరేకించింది. జస్టిస్ జేకే […]

విజయనగరం ఉత్సవం, బొత్స ఆగ్రహం

విజయనగరం అమ్మవారి ఉత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగ సమయంలో తనను అవమానించేందుకు, అంతమొందించేందుకు కుట్ర పన్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.బొత్స మాట్లాడుతూ, నేను వస్తున్నానని ముందుగానే చెప్పినా, అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. నాకు కేటాయించిన వేదిక కూలిపోయింది. ఇది యాదృచ్ఛికమా, లేక కుట్రో చెప్పాలని డిమాండ్ చేశారు. తన పార్టీ ఎమ్మెల్సీ సురేశ్ బాబు సహా పలువురికి గాయాలు […]

ట్రంప్‌కి నోబెల్‌ నిరాశ, నెటిజన్ల మీమ్స్‌

2025 నోబెల్‌ శాంతి బహుమతి ఈసారి వెనిజులా ప్రతిపక్ష నేత మారియా కొరినా మాచాడోకి లభించింది. ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె చేసిన కృషికి ఈ గౌరవం దక్కింది. వెనిజులా ఐరన్ లేడీగా పేరుపొందిన మాచాడో, టైమ్‌ మాగజైన్‌ The 100 Most Influential People of 2025 జాబితాలో కూడా చోటు సంపాదించారు.ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మాత్రం ఈసారి కూడా నోబెల్‌ బహుమతి గెలుచుకోలేక నిరాశ చెందారు. తాను అనేక యుద్ధాలు ఆపానని, […]