info@raviproduction.com

టిడిపి వర్సెస్ ఎన్టీఆర్ టిడిపి కానుందా?

వార్ 2 ప్రీ రిలీజ్ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మా తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆశీస్సులు ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు అనే డైలాగ్ పెద్ద చర్చకు దారి తీసింది. ఇది కేవలం సినిమా మాట మాత్రమే కాదని, ఆయన కళ్లలోని కసి, ధీమా చూస్తుంటే రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారేమో అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో టీడీపీ తరపున ప్రచారం చేసిన ఎన్టీఆర్, తర్వాత పార్టీకి దూరమయ్యారు. ఆ దూరానికి కారణం […]

జగన్ కు ఆలోచన లేదు: బాలకృష్ణ

టీడీపీ సీనియర్ నేత‌, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018లోనే ఆసుపత్రికి 21 ఎకరాల భూమి కేటాయించారని, 2019లో శంకుస్థాపన కూడా చేసినట్టు చెప్పారు. అయితే, జగన్ ప్రభుత్వం రాగానే అమరావతి అభివృద్ధిని అడ్డుకుని, తమ నిర్మాణ పనులు నిలిపివేసిందని ఆరోపించారు. “అప్పట్లో జగన్ సహకరించి ఉంటే, ఇప్పటికి పేదలకు ఉచితంగా వైద్యం అందుబాటులో ఉండేది” అని బాలకృష్ణ విమర్శించారు. ఆసుపత్రి పూర్తిగా విరాళాల ద్వారానే […]

ఆర్జీవికి రెండు కోట్లు లంచమా?

ఆంధ్రప్రదేశ్‌లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ వివాదంలోకి వచ్చారు. 2024లో వచ్చిన వ్యూహం సినిమాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌ల ఫోటోలను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలతో ఆయనను మంగళవారం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో దాదాపు 12 గంటలు విచారించారు.విచారణలో ప్రధానంగా గత ప్రభుత్వంనుంచి రూ.2 కోట్లు తీసుకున్నారన్న అంశంపైనే ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయని తెలుస్తోంది. వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌ను టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించడం, […]

ఓట్లు దోచిన బందిపోట్లు: జగన్

కడప జిల్లాలో జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్రంగా స్పందించారు. బుధవారం తాడేపల్లిలో అభ్యర్థులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, అధికార టీడీపీ నేతలు బందిపోట్లలా ఓట్లు దొంగిలించారని, పోలీసులు వారికి తోడ్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లను తెచ్చి, ఒక్కో ఓటరికి ఒక్కో రౌడీని పెట్టి బెదిరింపులు చేశారని విమర్శించారు. పలువురు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు గ్రామాల్లో తిష్ట […]

ట్రంప్ కి చెక్, భారత్ చైనాకి డోర్స్ ఓపెన్

అంతర్జాతీయ రాజకీయాలు, వాణిజ్య రంగంలో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై భారీ సుంకాలు విధించగా, ఇటీవల అమెరికా కూడా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై 50% సుంకం విధించింది. దీంతో భారత్ తన విదేశాంగ విధానాన్ని పునఃసమీక్షిస్తూ, కొత్త వ్యూహాత్మక భాగస్వాముల కోసం చూస్తోంది. ఈ క్రమంలో గత ఐదేళ్లుగా నిలిచిపోయిన భారత్–చైనా నేరుగా విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం కావడం ఒక కీలక పరిణామంగా మారింది. […]

జాతీయ మీడియాతో జగన్ భేటీ

చాలా రోజుల తర్వాత వైసీపీ అధినేత జగన్ మళ్లీ జాతీయ మీడియా ముందు కనిపించారు. తాడేపల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, మొదట రాష్ట్ర మీడియాతో, ఆ తర్వాత జాతీయ మీడియాతో ఆయన దాదాపు నాలుగు గంటలపాటు మాట్లాడారు. గత ఏడాది జరిగిన ఎన్నికలు, రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం, పాలన తీరు వంటి అంశాలపై జగన్ మాట్లాడారు. ఈ సమావేశానికి రెండు ప్రధాన కారణాలున్నాయని మొదటిది ఎన్నికల్లో ఓట్ల చోరీ, నకిలీ ఓట్లు, లెక్కల్లో అవకతవకల […]

బీరు అమ్మకాల్లో తెలంగాణా టాప్

తెలంగాణలో మద్యం, పొగాకు వినియోగం ఆందోళనకరంగా పెరుగుతోందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP) తాజా నివేదిక వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం, బీరు వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి సగటున బీరు, విదేశీ మద్యం కోసం రూ.3,061 ఖర్చు చేస్తున్నారు. ఇది దేశ సగటు రూ.486 కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ. 2014-15లో రూ.745గా ఉన్న మద్యం […]

కామ్రేడ్స్ పరిస్థితి ఏంటి జగన్ సార్?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్–టీడీపీకి పరోక్ష బంధం ఉందని, రాహుల్ గాంధీ–చంద్రబాబు మధ్య హాట్‌లైన్ నడుస్తోందని ఆయన ఆరోపించారు. ఈ సంధానానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాత్ర పోషిస్తున్నారని కూడా అన్నారు. ఏపీలో ఓట్ల దోపిడీపై రాహుల్ గాంధీ మౌనం పాటించడం పట్ల జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఒంటరిగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని, కానీ వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు. […]

మరో బిన్ లాడెన్ లా అసిమ్ మునీర్

అమెరికా పర్యటనలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన అణు బెదిరింపులు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు గురయ్యాయి. భారత్ పాక్‌పై దాడి చేస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని, తమ వద్ద ఉన్న అణు బాంబులను ఉపయోగించేందుకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించడం కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలపై పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ ఘాటుగా స్పందిస్తూ, మునీర్‌ను “సూట్ వేసుకున్న ఒసామా బిన్ లాడెన్”గా అభివర్ణించారు. పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని ఆయన […]

జూనియర్ ఎన్టీఆర్ కోసం వైసిపి యుద్ధం

రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు, రాజకీయాలు విడదీయలేని స్థాయిలో మిళితమైపోయాయి. సినీ రంగం నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వరకూ వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ బంధం మరింత గాఢమైంది. ఆయన వేదికలపైనే ప్రత్యర్థి నేతలపై విమర్శలు చేయడం, ప్రత్యేకంగా సీఎం జగన్‌పై వ్యాఖ్యలు చేయడం అలవాటైపోయింది. ఇదే సమయంలో, జగన్‌ను విమర్శించిన సినిమాలను వైసీపీ శ్రేణులు బహిష్కరించడం, ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దెబ్బతినడం జరుగుతోంది. తాజాగా, ఎన్టీఆర్ […]