info@raviproduction.com

తాడిపత్రి రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తత

తాడిపత్రిలో మళ్లీ రాజకీయ వేడి మొదలైంది.. సుప్రీం కోర్టు అనుమతితో 16 నెలల తర్వాత తన ఇంటికి చేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు మళ్లీ పట్టణంలోకి రానీయలేదు. ఈరోజు తాడిపత్రి రావడానికి ప్రయత్నించగా, స్వగ్రామం తిమ్మంపల్లి దగ్గరే అడ్డుకున్నారు.పోలీసుల వాదన ప్రకారం, పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉంటే మున్సిపల్ అధికారులు చేపట్టిన కొలతల పనులపై వివాదం చెలరేగే అవకాశం ఉందట. పెద్దారెడ్డి ఇంటిని మున్సిపల్ స్థలంలో నిర్మించారన్న ఆరోపణలతో అధికారులు కొలతలు తీస్తున్నారు. ఇప్పటికే ఒకసారి […]

కంగనా రనౌత్ కు సుప్రీంకోర్టులో షాక్

బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్‌ నుంచి ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. 2021లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల ఉద్యమంలో పాల్గొన్న 73 ఏళ్ల మహిళా రైతు మహీందర్ కౌర్‌ను కంగనా తీవ్రంగా విమర్శించారు. ఆమెను షాహీన్ బాగ్ నిరసనలో నిలబడ్డ బిల్కిస్ బానోతో పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మహీందర్ కౌర్ పరువు నష్టం కేసు వేశారు.ఈ కేసులో కంగనా దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం […]

జగన్ ని ఆహ్వానించిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలపై మళ్లీ రాజకీయ చర్చ మొదలైంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, సీఎం చంద్రబాబు పలుమార్లు జగన్‌ను సభకు రావాలని కోరారు. రాజంపేటలో పెన్షన్ పంపిణీ సభలోనూ, తాజాగా సూపర్ సిక్స్సభలోనూ సీఎం సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ కూడా జగన్ రాజ్యాంగాన్ని గౌరవించి సభకు హాజరుకావాలన్నారు.ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని, వైసీపి స్పష్టంగా చెబుతోంది.. ఒక్కో ఎమ్మెల్యేకు ఐదు నిమిషాల టైమ్ మాత్రమే దొరకడం వల్ల ప్రజా సమస్యలు చెప్పలేమని […]

ఏపీలో సంక్షేమం ఆగదు: చంద్రబాబు

రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నామని, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాలు కొనసాగుతున్నాయని చెప్పారు. సామాజిక భద్రతా పెన్షన్లు ఇప్పటికే నెలకు 4,000 నుంచి 6,000 కి పెంచామని తెలిపారు.ఈ పథకాల వలన ఏటా ప్రభుత్వంపై 60 వేల కోట్లు భారం పడుతుందని, భవిష్యత్తులో ఇది లక్ష కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. దసరా నుంచి ఆటో డ్రైవర్లకు […]

అమరావతిపై వైసిపి కొత్త మాట

వైసీపీకి 2024 ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమికి అమరావతి రాజధాని అంశమే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014–19లో అమరావతి రాజధానిగా ఓకే చెప్పిన వైసీపీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల సిద్ధాంతం తెచ్చి ప్రజల సెంటిమెంట్‌ను కోల్పోయింది. అమరావతిని నిర్లక్ష్యం చేయడంతో పాటు విశాఖ అభివృద్ధి కూడా జరగకపోవడంతో ప్రజలు గట్టిగా వ్యతిరేకించారు.ఇప్పుడేమో ఓటమి తర్వాత వైసీపీ తన వైఖరిని మార్చుకుంటోంది. ఇటీవల జగన్, అమరావతి ఖర్చులు ఎక్కువ అని చెప్పినా రాజధాని […]

ఏపీలో NSD ఏర్పాటు చేస్తాం: పవన్

ఏపీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. డిప్యూటీ సిఎమ్ పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని టాలెంటెడ్ యువతకు సినీ రంగంలో ప్రత్యేక శిక్షణ అందనుంది. యాక్టింగ్, టెక్నికల్, ప్రొడక్షన్ స్కిల్స్ పెంచుకునే అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు.ఎన్‌ఎస్‌డీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త టాలెంట్ యాక్టర్స్, టెక్నీషియన్స్ చేరతారని, దీంతో ఇండస్ట్రీ ప్రపంచస్థాయికి ఎదుగుతుందని పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. క‌ళలు వికసించే చోట నేరాలు తగ్గుతాయని […]

జనసేన ఎంపీకి షాక్

కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పేరును వాడుకొని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఆయన ఫొటో, పేరుతో నకిలీ వాట్సాప్ నంబర్ సృష్టించి, తెలంగాణలోని టీ-టైమ్ సంస్థ ఫైనాన్స్ మేనేజర్‌ను నమ్మించి 92 లక్షలు వసూలు చేశారు. అత్యవసరం.. వెంటనే డబ్బు పంపండంటూ పదేపదే మెసేజ్‌లు పంపడంతో, నిజంగానే ఎంపీ అని నమ్మిన మేనేజర్ పదకొండు సార్లు వివిధ ఖాతాలకు డబ్బులు బదిలీ చేశాడు.తర్వాత ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన ఖాతాలను పరిశీలించగా ఈ […]

ఉపరాష్ట్రపతి ఎన్నికలో క్రాస్ ఓటింగ్

ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరిగాయి. మొదట ఇండియా కూటమి గెలుస్తుందేమో అన్న అనుమానం కలిగించినా చివరికి ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. పోలింగ్ సమయానికి కొన్ని పార్టీలు దూరంగా ఉండగా, మరికొన్ని ఎన్డీఏకి మద్దతుగా నిలిచాయి. ముఖ్యంగా ఇండియా కూటమి పార్టీలకు చెందిన కొందరు ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేయడం పెద్ద ట్విస్ట్‌గా మారింది.తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్‌కు ప్రాంతీయ సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన అనుభవం, వ్యక్తిగత […]

పొసాని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్

సినీ రచయిత, నటుడు పొసాని కృష్ణమురళి మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి వివాదాలు, జైలు జీవితం చూసిన ఆయన, కొంతకాలం నిశ్శబ్దంగా గడిపారు. ఇప్పుడు మాత్రం పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.ఈ నెల 22న నవరాత్రుల సందర్భంగా ఆపరేషన్ అరుణారెడ్డి పేరుతో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. జర్నలిస్టు బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథను ఆయన స్వయంగా రాసి, దర్శకత్వం వహించబోతున్నారు. అంతేకాదు సినిమాలో ఒక కీలక పాత్రలో కూడా […]

ట్రంప్ సన్నిహితునిపై కాల్పులు

అమెరికాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కన్సర్వేటివ్ సంస్థ టర్నింగ్ పాయింట్ USA సహ వ్యవస్థాపకుడు, సీఈఓ చార్లీ కిర్క్.. ఉటాహ్ వాలీ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించారు. ఆయనకు సీరియస్ గా ఉందని మాత్రమే తెలిపారు. అధికారికంగా ఆయన మరణం ధృవీకరించబడలేదని అమెరికా మీడియా స్పష్టం చేస్తోంది. అయితే ఈ సంఘటనతో అమెరికా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. యువతలో దేశభక్తి, కన్సర్వేటివ్ ఆలోచనలను […]