ట్రంప్ సన్నిహితునిపై కాల్పులు

అమెరికాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కన్సర్వేటివ్ సంస్థ టర్నింగ్ పాయింట్ USA సహ వ్యవస్థాపకుడు, సీఈఓ చార్లీ కిర్క్.. ఉటాహ్ వాలీ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించారు. ఆయనకు సీరియస్ గా ఉందని మాత్రమే తెలిపారు. అధికారికంగా ఆయన మరణం ధృవీకరించబడలేదని అమెరికా మీడియా స్పష్టం చేస్తోంది. అయితే ఈ సంఘటనతో అమెరికా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. యువతలో దేశభక్తి, కన్సర్వేటివ్ ఆలోచనలను రగిలించడంలో చార్లీ కిర్క్ ప్రముఖ పాత్ర పోషించారు. ఈ ఘటనపై రిపబ్లికన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హింసను ఖండించారు. పోలీసులు దాడి వెనుక ఉద్దేశ్యాన్ని విచారిస్తున్నారు. ట్రంప్ సహా పలువురు నేతలు చార్లీ కిర్క్ కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. అమెరికా రాజకీయాల్లో భద్రతా లోపాలపై మళ్లీ చర్చ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *