info@raviproduction.com

6 వేలమంది విద్యార్థులకు US వీసా రద్దు.

అమెరికాలో ఉన్నత విద్య చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు గట్టి దెబ్బ తగిలింది. అమెరికా విదేశాంగ శాఖ తాజాగా దాదాపు 6,000 మందికి వీసాలు రద్దు చేసింది. వీరిలో ఎక్కువ మంది చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవారేనని అధికారులు తెలిపారు. మత్తులో డ్రైవింగ్, దాడులు, దోపిడీలు చేసిన విద్యార్థుల వీసాలు రద్దు చేయగా, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న 300 మందికి పైగా విద్యార్థులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ విద్యార్థులపై […]

పవన్ కళ్యాణ్ నటించకు: మాజీ ఐఏఎస్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హైకోర్టులో ఊహించని షాక్ ఎదురైంది. ఆయన నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ వనరులను వాడుకున్నారని మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ తన హోదాను ఉపయోగించి సినిమా టికెట్ ధరల పెంపు ఫైల్‌ను స్వయంగా ప్రాసెస్ చేశారని, ప్రచారానికి ప్రభుత్వ నిధులు వినియోగించారని ఆరోపించారు. మంత్రి వ్యాపార కార్యక్రమాల్లో నేరుగా పాలుపంచుకోవడం నియమాలకు […]

విశాఖలో గుడివాడ గడబిడ సొద

“”””””””””””””””””””””””””వైసీపీ లో విశాఖ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ కు అనకాపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా, ఆయన దృష్టి మాత్రం విశాఖపైనే ఉందని పార్టీ లోపలే చర్చ సాగుతోంది. మరోవైపు, 2019, 2024లో వరుసగా ఓడిపోయినా పార్టీ పట్ల విధేయతను చూపిన కేకే రాజు కు విశాఖ జిల్లా అధ్యక్ష బాధ్యతలు జగన్ ఇచ్చారు. ఆయన నాయకత్వంలో జరిగిన స్థాయీ సంఘం ఎన్నికల్లో వైసీపీ ఒక కీలక సీటు […]

ఆసియా కప్ కి టీమ్ సెలక్షన్ బాలేదబ్బా

ఆసియా కప్ 2025 కోసం టీమిండియా స్క్వాడ్ ప్రకటించబడింది. 15 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రకటించారు. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ బాధ్యతలు చేపట్టనున్నారు. జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లకు చోటు దక్కకపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, జితేష్ శర్మ ఉంటారు. పేస్ ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, […]

అమరావతిలో పులసచేప: మంత్రి సీరియస్

అమరావతి వరదలపై రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కాయి. ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అమరావతిలో పులస చేపలు దొరికే పరిస్థితి వస్తుందని కాంట్రవర్సీ కామెంట్స్ చేయగా, దీనిపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. మున్సిపల్ మంత్రి నారాయణ స్పందిస్తూ.. నీరుకొండ, కొండవీటి వాగు ప్రాంతాలను పరిశీలించి, వెస్ట్ బైపాస్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణ సమయంలో మట్టి అడ్డుగా వదిలేయడంతో నీరు నిలిచిపోయిందని తెలిపారు. మట్టిని తొలగించి, రెండు చోట్ల గండ్లు కొట్టి నీరు సాఫీగా […]

మంచితనం పనికిరాదు ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో అతి మంచితనం పెద్ద ఇబ్బందిగా మారిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. టెంపర్ నుంచి వరుసగా హిట్లు ఇస్తూ వచ్చిన తారక్, ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ కోసం సహాయపాత్రలో కనిపించగా, హీరోగా క్రెడిట్ అంతా చరణ్‌దే అయ్యింది. ఇప్పుడు అదే పొరపాటు వార్ 2లోనూ చేసారని విమర్శలు వస్తున్నాయి. యష్ రాజ్ ఫిలింస్‌ కోసం తన క్రేజ్ తగ్గించే పాత్ర ఎందుకు చేశాడని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఫ్లాప్‌లో ఉన్న దర్శకులకు […]

చంద్రబాబును మరిపిస్తున్న చినబాబు

టీడీపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటన బిజీగా కొనసాగుతోంది. ఉదయం చేరుకున్న ఆయన వరుసగా కేంద్ర మంత్రులను, అధికారులను కలుస్తున్నారు. ముందుగా విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కలిసి ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో సహకారం కోరారు. దీంతో ఐటీ రంగం, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో, పరిశ్రమల మంత్రి కుమారస్వామితో, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. రాజధాని, పోలవరం, పెట్టుబడుల వాతావరణం, రైల్వే ప్రాజెక్టులు, […]

ఉచిత బస్ అవసరమా? : బిజెపి

[9:36 AM, 8/19/2025] srinivas Writings: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకాలపై బీజేపీ నేతల వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ మద్దతుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ, కూటమి భాగస్వాముల మధ్య విభేదాలు బయటపడుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌గా ఉన్న లంకా దినకర్, ఉచిత పథకాలపై జాతీయస్థాయి చర్చ అవసరమని సూచించగా, ఆచరణీయమైన పథకాలే అమలు చేయాలని చంద్రబాబుకు నివేదిక ఇస్తానని అన్నారు. ఇదే సమయంలో […]

వాళ్ళు సర్దుకుపోరు, వీళ్ళు సర్దిచెప్పరు

రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతలు–జూనియర్ నేతల మధ్య విభేదాలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఒకే పార్టీలో ఉన్నా కలిసిపోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేనలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు సీనియర్ల సలహాలను పట్టించుకోవడంలేదు. తాము టికెట్లు త్యాగం చేశామని చెప్పుకునే సీనియర్లను పక్కన పెట్టేస్తున్నారు. పైగా కొందరు పొరుగు పార్టీల నుంచి వచ్చి గెలవడంతో విభేదాలు మరింతగా ముదురుతున్నాయి. మైలవరం, నూజివీడు, కోవూరు, తిరువూరు, కొవ్వూరు, అనంతపురం అర్బన్ వంటి నియోజకవర్గాల్లో ఈ తగాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. […]

ఫ్రీ బస్ పథకం సక్సెస్ కాలేదా?

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తాజాగా ప్రారంభించారు. ఈ పథకాన్ని మొదట కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అమలు చేసింది. తర్వాత తెలంగాణాలో కూడా అమలు చేశారు. కానీ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ లాభం పెద్దగా రాలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో మూడు, తెలంగాణాలో ఎనిమిది ఎంపీ సీట్లు మాత్రమే గెలిచారు. ఉచిత బస్సుల వల్ల మహిళలకు కొంత సౌలభ్యం కలిగినా ఆటో డ్రైవర్లు, పురుష ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. […]