బొత్స అల్లాడిపోతున్నాడమ్మా!

విజయనగరం జిల్లా రాజకీయాలు మరోసారి ఉత్కంఠ రేపుతున్నాయి. చరిత్ర పూర్వకాలం నుంచి పూసపాటి రాజులు ఈ ప్రాంతానికి ప్రతీకగా నిలిచారు. స్వాతంత్ర్యం తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ ఆ ప్రభావమే కొనసాగింది.
జిల్లా రాజకీయాల్లో గత మూడున్నర దశాబ్దాలుగా బొత్స సత్యనారాయణ అగ్రస్థానంలో ఉన్నారు. 1999 లో బొబ్బిలి ఎంపీగా మొదలైన ఆయన రాజకీయ ప్రయాణం 2004లో వైఎస్సార్ తో కలసి అగ్రభాగానికి చేరింది. పీసీసీ చీఫ్ గా, మంత్రి పదవుల్లోనూ సుదీర్ఘకాలం పని చేశారు. స్నేహపూర్వక రాజకీయాలతో జిల్లా రాజకీయాలపై బలమైన పట్టు సాధించారు.
అయితే ఇప్పుడు బొత్సకు సవాలు విసురుతున్న టీడీపీ యువనేత కిమిడి నాగార్జున 2019లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయినా ఆ ప్రాంతంలో తన బలాన్ని పెంచుకున్నారు. 2024లో కళా వెంకటరావుకు సహాయం చేసి టీడీపీ విజయానికి తోడ్పడ్డారు. తాజాగా గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు వెళ్లిపోవడంతో నాగార్జునకు టీడీపీ హైకమాండ్ నుంచి ప్రాధాన్యం పెరిగింది.
లోకేష్ స్వయంగా విజయనగరం రాజకీయాలపై దృష్టి పెట్టడంతో, బొత్స ప్రభావాన్ని తగ్గించే వ్యూహాలు మొదలయ్యాయనే ప్రచారం సాగుతోంది. పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో బొత్సకు ఎదురైన షాక్ దీనికి ఉదాహరణ అని చెబుతున్నారు.
మొత్తం మీద విజయనగరం జిల్లా రాజకీయాలు బొత్స, నాగార్జున పోటీలో మరింత వేడెక్కుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *