శ్రేయాస్ అయ్యర్ కోసం సోషల్ ఫైట్

భారత క్రికెట్‌లో ప్రతిభకు కొదవ లేదు. అలాంటి ప్రతిభావంతుల్లో శ్రేయస్ అయ్యర్ పేరు ముందుంటుంది. రంజీ నుంచి ఐపీఎల్ వరకు తన దూకుడు బ్యాటింగ్, చాకచక్యమైన కెప్టెన్సీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కి తీసుకెళ్లడం, ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన ఇవ్వడం అతని సామర్థ్యానికి నిదర్శనం. అయితే తాజాగా ఆసియా కప్ జట్టులో చోటు దక్కకపోవడం అభిమానులను నిరాశపరిచింది. క్రికెట్ విశ్లేషకులు కూడా అయ్యర్‌కి అన్యాయం జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా, జట్టు అధికారిక సోషల్ మీడియా ద్వారా అతనికి పరోక్షంగా మద్దతు తెలపడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న అయ్యర్ ఫీల్డింగ్, బ్యాటింగ్ రెండింటితోనూ జట్టుకు అదనపు బలం అవుతాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది. అందుకే ఒక్క ప్రశ్న అందరి నోట వినిపిస్తోంది – బీసీసీఐ, కోచ్ గౌతమ్ గంభీర్ అతనికి మరోసారి న్యాయం చేస్తారా? లేక అవకాశాలు రాజకీయాలకు బలికావాలా? అభిమానులు మాత్రం అతను మళ్లీ జట్టులో స్థిరంగా ఆడతాడన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *