కడప జిల్లాలోని పొద్దుటూరు నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఆరోగ్యం బాగోలేక రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన కొడుకు కొండారెడ్డి మాత్రం అధికారిక కార్యక్రమాల్లో హాజరై షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.
అధికారులతో మీటింగులు, అభివృద్ధి పనుల ప్రారంభాలు, బదిలీ వ్యవహారాల వరకు ఆయన చురుకుగా పాలుపంచుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో అధికారులు కూడా అయోమయంలో పడ్డారు. అసలు అధికార హోదా ఎవరిది? తండ్రిదా, కుమారుడిదా అన్న చర్చ నడుస్తోంది.
విపక్షాలు దీనిపై తీవ్రంగా స్పందిస్తూ ఇది ప్రజాస్వామ్యమా లేక కుటుంబ రాజ్యమా? అని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు, టీడీపీ హైకమాండ్ ఈ వ్యవహారంపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రస్తుతం పొద్దుటూరులో షాడో ఎమ్మెల్యే దూకుడు చర్చగా మారింది.

