చంద్రబాబును మరిపిస్తున్న చినబాబు

టీడీపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటన బిజీగా కొనసాగుతోంది. ఉదయం చేరుకున్న ఆయన వరుసగా కేంద్ర మంత్రులను, అధికారులను కలుస్తున్నారు. ముందుగా విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కలిసి ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో సహకారం కోరారు. దీంతో ఐటీ రంగం, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో, పరిశ్రమల మంత్రి కుమారస్వామితో, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. రాజధాని, పోలవరం, పెట్టుబడుల వాతావరణం, రైల్వే ప్రాజెక్టులు, మెట్రో ప్రాజెక్టులపై చర్చించారు. విశాఖ ఉక్కు బలోపేతం, కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించాలని కోరారు. మంగళవారం కూడా పలు పారిశ్రామికవేత్తలతో సమావేశమై పెట్టుబడుల సాధన దిశగా చర్చలు జరపనున్నారు. ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడం తన లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు.
అలాగే, ఏపీకి అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *